byసూర్య | Thu, Mar 28, 2024, 04:30 PM
ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం ఖమ్మం రూరల్ డివిజన్ పరిధిలోని కారేపల్లి క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో మోహరించిన కేంద్ర పోలీసు బలగాలతో పాటు స్ధానిక పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.