హైదరాబాద్‌వాసులు, ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. ఆ రూట్‌లో అందుబాటులోకి ఎంఎంటీఎస్

byసూర్య | Fri, Mar 01, 2024, 09:17 PM

హైదరాబాద్‌‌వాసులు, ఐటీ ఉద్యోగులకు శుభవార్త. మొత్తానికి ఎంఎంటీఎస్‌ రెండో దశ పూర్తయ్యింది. నగరానికి తూర్పు, పడమర వైపుగా ఉన్న ఐటీ కారిడార్‌లను కలుపుతూ లింగంపల్లి - ఘట్‌కేసర్‌ మధ్య ఎంఎంటీఎస్‌ పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌ను బైపాస్‌ చేస్తూ లింగంపల్లి - సనత్‌నగర్‌ - మౌలాలి - చర్లపల్లి - ఘట్‌కేసర్‌ మార్గంలో ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి నాలుగైదు తేదీల్లో ఈ రూట్‌లలో ఎంఎంటీఎస్‌ను ప్రారంభించనున్నారు. కాలుష్యం సమస్య లేకుండా.. వేగవంతంగా.. నగర ప్రజలకు కేవలం రూ.5ల టిక్కెట్‌ ధరతో ప్రయాణించొచ్చు.


హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ మొదటి దశ 2003లో అందుబాటులోకి రాగా.. రెండో దశ 2014లో ప్రారంభమై 2019 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ దిశగా పనులు చేపట్టారు.. కానీ కొంతమేర పనులు జాప్యం కావడంతో.. రూ.817 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1165 కోట్లకు పెరిగింది. నిధుల కొరత, రక్షణ శాఖ అనుమతుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది. తెలంగాణ సర్కార్ నుంచి కూడా రావాల్సిన నిధులు అందకపోయినా సరే.. దక్షిణ మధ్య రైల్వే జనవరి నాటికి పనులు, తరువాత ట్రాక్‌ టెస్టు పూర్తి చేసింది.. 101 కిమీ.మేర రెండో దశ పూర్తయింది.


ఈ లైన్‌ను ప్రధాని ప్రారంభించినా సరే.. ఎంఎంటీఎస్‌ సేవలు ఆశించినమేరకు అందుబాటులోకి రావు అంటున్నారు. గత ఏప్రిల్‌లో సికింద్రాబాద్‌- మేడ్చెల్‌, ఫలక్‌నుమా -ఉందానగర్‌, రామచంద్రాపురం- తెల్లాపూర్‌ మార్గాలలో పనులు ప్రారంభించారు. ప్రయాణికులు లేరని రాత్రి పూట హాల్టింగ్‌కే తెల్లాపూర్‌ స్టేషన్‌ పరిమితంకాగా మేడ్చెల్‌ - సికింద్రాబాద్‌ మధ్య 13 సర్వీసులనే అందుబాటులోకి తెచ్చారు. ఇదే పరిస్థితి ఫలక్‌నుమా-ఉందానగర్‌ మధ్య ఉంది. మొదటి దశ 121 సర్వీసులు, 1.20 లక్షల ప్రయాణికులతో నడిచేది. తరచూ రద్దు చేస్తుండటంతో చాలామంది ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు అంటున్నారు.



Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM