byసూర్య | Fri, Mar 01, 2024, 03:29 PM
దమ్మపేటలో మార్చి 2న ప్రారంభానికి సిద్దమైన జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం పరిశీలించారు. కోర్టు భవన నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే ఉన్న సమయంలో కోర్టు భవనం పూర్తయి ప్రజలకు అందుబాటులోనికి రావటం సంతోషంగా ఉందని, గిరిజన ప్రాంతంలో చాలా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని సంతోషం వ్యక్తం చేశారు.