byసూర్య | Fri, Mar 01, 2024, 03:10 PM
బాధ్యత మరచి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. వాస్తవాలు చెప్పడానికే మా ఈ ఛలో మేడిగడ్డ పర్యటన అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రైతు ప్రయోజనం ముఖ్యం కాదని.. రాజకీయ ప్రయోజనం మాత్రమే కావాలని విమర్శించారు. ఇవాళ చేస్తున్న పర్యటన మొదటి పర్యటన మాత్రమేనని.. తర్వాత అన్ని ప్రాజెక్టులు పర్యటిస్తామన్నారు. రిపేర్ చేయకుండా ఉంటే వర్షాకాలంలో వరద వస్తే బరాజ్ కొట్టుకుపోవాలని చూస్తున్నారని అన్నారు.