byసూర్య | Fri, Mar 01, 2024, 03:11 PM
అమీర్ పేట్ సమీపంలోని మధుర నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు నడుపుతున్న వ్యక్తికి ఒక్కసారిగా మూర్ఛ రావడంతో. వాహనం అదుపు తప్పి వేగంగా వెళ్లి చౌరస్తాలో ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభంతో పాటు ఓ బైక్ ను ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బైకుపై ఉన్న ఇద్దరికీ గాయాలు అయినట్లు సమాచారం. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.