byసూర్య | Fri, Mar 01, 2024, 03:12 PM
మరికాసేపట్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం తాజ్ కృష్ణా హోటల్లో జరగనుంది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీష్ చౌదరి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మహబూబ్నగర్ మినహా 16 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇందులో కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, నేతలు జిగ్నేష్ మేవాని, విశ్వజీత్ కడం, పాల్గొననున్నారు.