byసూర్య | Fri, Mar 01, 2024, 02:53 PM
గురుకుల డిగ్రీ, జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం కొప్పోల్ గ్రామానికి చెందినటువంటి అయితరాజు మమత కామర్స్ విభాగంలో జూనియర్ లెక్చరర్ గా సెలెక్ట్ అయ్యారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. చదువు మీద ఉన్నటువంటి ఆసక్తిని గ్రహించిన నా భర్త ఉన్నత చదువులు చదవడానికి ప్రోత్సహించడంతో ఈ ఉద్యోగం సాధించానని తెలిపారు. గురుకుల లెక్చరర్ గా ఉద్యొగం సాధించిన మమతకి కుటుంబసభ్యులు, బందువులు అభినందనలు తెలిపారు.