byసూర్య | Fri, Mar 01, 2024, 02:48 PM
పార్కింగ్ చేసి ఉన్న వాహనాల టార్గెట్ గా అద్దాలు పగలగొట్టి డబ్బులు దొంగిలించే ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మిర్యాలగూడ డీఎస్పీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా బోగోల్ మండలానికి చెందిన పిట్ల మహేష్, ఆవుల రాకేష్ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. వీరి నుంచి నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.