byసూర్య | Fri, Mar 01, 2024, 01:59 PM
తీసుకున్న డబ్బులు ఇవ్వనందున ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సత్తుపల్లి జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్కే. ఆయేషాషరీన్ ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు.
స్థానిక పాకలగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు హరికిరణ్ కుమార్ 2016లో పట్టణానికి చెందిన సూర్యచంద్రరావు వద్ద రూ. 8లక్షలు అప్పుగా తీసుకున్నారు. డబ్బులు చెల్లించమని ఒత్తిడి చేయగా, బ్యాంక్ చెక్కు ను ఇవ్వగా అది చెక్ బౌన్స్ అయ్యింది.