byసూర్య | Fri, Mar 01, 2024, 01:42 PM
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.