byసూర్య | Thu, Feb 29, 2024, 02:11 PM
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గండిపేట వద్ద బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి స్పాట్ లోనే మృతి చెందింది. దంపతులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ చిన్నారి తండ్రి గోపాల్ మృతి చెందారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి, తండ్రి గోపాల్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.