byసూర్య | Thu, Feb 29, 2024, 01:51 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి ఇది కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని తాజా సర్వేలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికల కోసం కార్యాచరణను వేగవంతం చేసిన హస్తం పార్టీ తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చిస్తోంది.
ఈ నేపథ్యంలో లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీల వారీగా సర్వే ఫలితాలను పరిశీలించినట్లు కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగులు తెలియజేసారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సునీల్ కానుగులు జరిపిన సర్వేల్లో దాదాపు 12 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్ల శాతం పెరిగినట్లు తేలింది.