byసూర్య | Thu, Feb 29, 2024, 02:12 PM
ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు శుక్రవారం ఛలో పాలమూరు, రంగారెడ్డి పథకం పనులు పరిశీలనకు వెళ్తున్నట్లు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి తెలిపారు. గురువారం హైద్రాబాద్ లోని గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పాలకులు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తామని అబద్ధాలు చెప్పి మోసం చేసారని అన్నారు. ప్రాజెక్టు పనులు పరిశీలిస్తామని అన్నారు.