![]() |
![]() |
byసూర్య | Fri, Feb 23, 2024, 04:18 PM
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు ప్రధాని మోడీ యత్నిస్తుండడంతోనే రైతాంగంపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని వామ పక్షాల నేతలు ఆరోపించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై జరిగిన కాల్పులకు నిరసనగా గురువారం ఖమ్మంలోని అంబేద్కర్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.