![]() |
![]() |
byసూర్య | Fri, Feb 23, 2024, 01:39 PM
రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27 లేదా 29 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. రాష్ట్రంలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరిలో 89.99 లక్షల మందికి రేషన్ కార్డు ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం 39.50 లక్షల మందిని సబ్బిడీ సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.