byసూర్య | Sun, Dec 10, 2023, 10:11 AM
దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల సెక్టార్లో గల సూరవరం అంగన్వాడి భవనం ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. అంగన్వాడి భవనం గోడ ఓవైపు పగుళ్లు వచ్చి కూలడానికి సిద్ధంగా ఉంది. దీంతో పాటు స్లాబు సైతం పలుచోట్ల పగుళ్లు వచ్చింది. పగుళ్లు వచ్చిన గోడ సందులోంచి విషపురుగులు లోనికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మత్తులు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.