byసూర్య | Sun, Dec 10, 2023, 10:08 AM
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని 3. 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శనివారం మీర్ పేట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చేదురుపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ గా పనిచేసే రాగుళ్ల శ్రీకాంత్ నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి మీర్ పేట్ తిరుమలనగర్ లో విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నారు.