తెలంగాణలో సంక్షేమానికి ఇది తొలి అడుగు,,,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్

byసూర్య | Sat, Dec 09, 2023, 09:04 PM

"తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు" అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం మేం చెప్పిన కార్యాచరణ మొదలైంది... తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణలో సంక్షేమానికి ఇది తొలి అడుగు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సందర్భంలోని ఫోటోలను ట్వీట్ చేశారు. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీలు ఆ ఫొటోల్లో ఉన్నారు.



Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM