తెలంగాణలో సంక్షేమానికి ఇది తొలి అడుగు,,,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్

byసూర్య | Sat, Dec 09, 2023, 09:04 PM

"తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు" అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం మేం చెప్పిన కార్యాచరణ మొదలైంది... తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణలో సంక్షేమానికి ఇది తొలి అడుగు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సందర్భంలోని ఫోటోలను ట్వీట్ చేశారు. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీలు ఆ ఫొటోల్లో ఉన్నారు.



Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM