డోరు తెరుచుకున్నా పైకి రాని లిఫ్ట్‌,,,,,ఫోర్త్ ఫ్లోర్ నుంచి పడి కొరియర్‌ బాయ్‌ మృతి

byసూర్య | Sat, Dec 09, 2023, 08:09 PM

రంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‍ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫోర్త్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్‌లో పడిపోయి డెలివరీ బాయ్ మృతి చెందాడు. ఫోన్ మాట్లాడుతూ.. నాలుగో అంతస్తులో లిఫ్ట్ గ్రిల్ తెరవగా.. లిఫ్ట్ వచ్చిందని అందులో కాలు పెట్టాడు. అయితే అప్పటికే లిఫ్ట్ పైకి రాకపోవటంతో కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మయూరీ నగర్‌లో నివాసముంటున్న జేమ్స్‌(38) ఓ ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డిసెంబర్ 7న మధ్యాహ్నం అశోక్‌ నగర్‌లోని నివాస్‌ టవర్స్‌ అనే అపార్టుమెంట్ నాలుగో అంతస్తులో ఇచ్చిన పార్సిల్‌ను రిటర్న్ తీసుకోవడానికి వెళ్లారు. తిరిగి కిందకు వెళ్లేందుకు నాలుగో అంతస్తులోని లిఫ్ట్‌ గ్రిల్‌ డోర్‌ తెరిచారు. లిఫ్ట్‌ పైకి రాక కిందే ఉండిపోయింది. ఫోన్‌ మాట్లాడుతూ.. ఇది గమనించని ఆయన లిఫ్ట్‌ లోపలికి వెళ్లేందుకని కాలు పెట్టారు.


దీంతో మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్‌ పైభాగంలో పడిపోయారు. వేరేవారు లిఫ్ట్‌ ఆన్‌చేసి పై అంతస్తులోకి వెళ్లారు. పైభాగంలో ఉన్న స్లాబ్‌ తగలడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మూడో అంతస్తులో ఆగిపోవడంతో మెకానిక్‌ వచ్చి మరమ్మతులు చేస్తుండగా పైభాగంలో మనిషి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అపార్టుమెంట్ వాసులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM