నేటి నుంచి మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ.. మార్గదర్శకాలివే..

byసూర్య | Sat, Dec 09, 2023, 07:20 PM

'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్ సర్వీసులతో పాటు.. హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్‌ల్లో బస్సుల్లో మహిళలు ఫ్రీ జర్నీ చేయవచ్చు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్‌లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చుని వెల్లడించింది.


మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ అమలుపై శుక్రవారం (డిసెంబర్ 8న) ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మహిళలకు ఉచిత ప్రయాణ మార్గదర్శకాలను వారికి వివరించారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నారు. సీఎం ఈ పథకాన్ని ప్రారంభించగానే శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.


మహిళలకు ఫ్రీ జర్నీ.. మార్గదర్శకాలివే:


పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ వర్తింపు


తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఉచిత ప్రయాణం ఉంటుంది.


స్థానికత ధ్రవీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి. (ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, కేంద్రం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు)


ప్రయాణించే ప్రతి మహిళకు కండక్టర్ ద్వారా జీరో టికెట్ మంజూరు చేయబడుతుంది.


కిలోమీటర్ల ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితుల్లేవు.


అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.


Latest News
 

మెదక్ బిజెపి ఎంపి రఘునందన్‌రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం Fri, Sep 20, 2024, 12:12 PM
మందుల దుకాణాలు పై డీసీఏ అధికారులు దాడులు Fri, Sep 20, 2024, 12:07 PM
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రీల్స్ చేస్తున్న ఆకతాయిలు Fri, Sep 20, 2024, 11:59 AM
నార్కెట్‌పల్లి రహదారిపై అగ్ని ప్రమాదం Fri, Sep 20, 2024, 11:36 AM
రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు Fri, Sep 20, 2024, 10:48 AM