‘కేటీఆర్‌‌కు తగిన ప్రత్యామ్నాయం.. ఐటీ మినిస్టర్ ఈయనైతే బాగుంటుంది’.. సోషల్ మీడియాలో చర్చ

byసూర్య | Wed, Dec 06, 2023, 08:57 PM

తెలంగాణ కొత్త సీఎంపై ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. రేపు సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక సీఎం ఎవరనేది తేలటంతో ఇప్పుడు మంత్రులుగా ఎవర్ని నియమిస్తారు ? ఎవరికి ఏ శాఖ అప్పగిస్తారు? అనేది హాట్ టాఫిక్‌గా మారింది. అందులోనూ ఐటీ శాఖ ఎవరికి ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. ఆ రెండు పర్యాయాలు కేటీఆర్ ఐటీ మంత్రిగా పని చేశారు. తన సమర్థతవంతమైన పనితీరుతో ఆ శాఖకే కొత్త వన్నెను తీసుకొచ్చారు. యువత ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యాపారవేత్తలుగా ఎదగాలని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 'టి-హబ్' అనే వేదికకు అంకురార్పణ చేశారు. ఇది పూర్తిగా కేటీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిందే. ఏడేళ్లు తిరిగే సరికి 'టి-హబ్' ప్రపంచ స్థాయి స్టార్టప్‌లకు వేదికగా మారింది.


ఐటీని హైదరాబాద్‌కు మాత్రమే పరమితం చేయకుండా రాష్ట్రంలోని టూ టైర్ నగరాలకు కూడా విస్తరించారు. ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యక్రమాలుగా ఏర్పాటు చేసేలే కేటీఆర్ చొరవ తీసుకున్నారు. దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేలా చేశారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో కేటీఆర్‌కు మద్దతుగా పోస్టులు పెట్టారు. కేటీఆర్ లాంటి డైనమిక్ ఐటీ మినిస్టర్ దొరకరని చెప్పారు. మరికొందరైతే కాంగ్రెస్ గెలిచినా.. కేటీఆర్‌నే తిరిగి ఐటీ మినిస్టర్‌గా కొనసాగించాలంటూ సాధ్యంకాని విషయాలను కూడా పంచుకున్నారు. ఐటీపై కేటీఆర్ తనదైన ముద్రవేశారని అంతటి సమర్థత ఉన్న వ్యక్తి కాంగ్రెస్‌లో ఉన్నాడా ? అంటూ ప్రశ్నలు కూడా లేవనెత్తారు. నెటిజన్ల ప్రశ్నలకు తాజాగా కాంగ్రెస్ మద్దతుదారులు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. కేటీఆర్‌కు సరితూగే సమర్థవంతమైన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారని చెబుతున్నారు. ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు పేరును ఐటీ మంత్రిగా వారు సూచిస్తున్నారు. మదన్ మోహన్ రావు ది వార్టన్ స్కూల్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడని...యూఎస్ఎం బిజినెస్ సిస్టమ్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించాడని చెబుతున్నారు. ఐటీ మంత్రి మంత్రిత్వశాఖకు ఆయన సరైన వ్యక్తని సూచిస్తున్నారు. మదన్ ఉన్నత విద్యావంతుడని, కమ్యూనికేషన్స్ స్కిల్స్ దండిగా ఉన్నాయని కేటీఆర్‌ స్థానాన్ని కచ్చితంగా భర్తీ చేస్తాడని అంటున్నారు. మదన్ మోహన్ రావును ఐటీ మంత్రిగా నియమించటం సరియైన నిర్ణయమని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆయన ఉన్నత విద్యావతుండని.. స్పా్ర్క్ ఉందని కచ్చితంగా కేటీఆర్‌లాగే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే సత్తా ఉందని అంటున్నారు. ఇలా ఎవరికి వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా.. ఐటీ మంత్రిగా ఎవర్ని నియమిస్తారనేది నేడో రేపో తేలనుంది.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM