byసూర్య | Wed, Dec 06, 2023, 03:55 PM
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించిన జేయింట్ కిల్లర్, బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి బుధవారం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిశారు. తనను కలిసేందుకు కామారెడ్డి నుండి కరీంనగర్ అనుచరులతో కలిసి వచ్చిన వెంకట రమణారెడ్డిని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.