byసూర్య | Wed, Dec 06, 2023, 08:34 AM
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వెంకటేశ్ పై ఫోక్సో కేసు నమోదయింది. 4 రోజుల కిందట పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండ్ కు తరలించినట్లు మంగళవారం గద్వాల రూరల్ ఎస్ఐ ఆనంద్ తెలిపారు.