byసూర్య | Wed, Dec 06, 2023, 08:35 AM
నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో బుధవారం ఉదయం భారత మొదటి న్యాయశాఖ మంత్రి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోనేటి తిరుపతయ్య పాల్గొని అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇరుకు ఎల్లేష్, బళ్లారి జనార్ధన్, వార్డు మెంబర్ గుంపల్లి నాగరాజు, ఆంజనేయులు, పూజారి జీవన్, వీరస్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.