పవర్‌లోకి కాంగ్రెస్.. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగంలోకి డిప్యూటీ కలెక్టర్.. అప్పట్లో ఏం జరిగింది?

byసూర్య | Tue, Dec 05, 2023, 06:08 PM

ఉద్యోగ సంఘం నేత, డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డి తిరిగి ఉద్యోగంలో చేరాడు. నాలుగేళ్ల తర్వాత ఆయన తన ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెదిగి.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న తరుణంలో ఆయన ఉద్యోగబాధ్యతలు చేపట్టడం అటూ రాజకీయ వర్గాల్లోనూ ఇటు ఉద్యోగ సంఘాల్లోనూ చర్చనీయాంశమైంది. 2018కి ముందు లచ్చిరెడ్డి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అయితే 2019లో ఫిట్‌మెంట్ కోసం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేపట్టగా.. వారికి రెవెన్యూ ఉద్యోగ సంఘాల తరపున మద్దతు ప్రకటించారు. అక్కడే ప్రభుత్వానికి లచ్చిరెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయు. ఆ సమయంలో కీసర ఆర్డీవోగా ఉన్న ఆయనపై బదిలీ వేటు వేశారు.


లచ్చిరెడ్డిని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. తనను బదిలీ చేయటంపై లచ్చిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఆయన విధులకు గైర్హాజరయ్యారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్‌లో వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుంటూ ప్రభుత్వానికి లెటర్ పంపారు. అయితే ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించలేదు. అప్పటి నుంచి ప్రభుత్వంపై పలు సందర్భాల్లో లచ్చిరెడ్డి విమర్శలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మారటంతో ఆయన తిరిగి ఉద్యోగంలోకి చేరారు. సోమవారం సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌ను కలిసి రిపోర్ట్ చేశారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM