byసూర్య | Tue, Dec 05, 2023, 05:49 PM
ముధోల్ ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు యు-డైస్ ఫారం ఫీలింగ్ పై శిక్షణ ఏర్పాటు చేశారు. ఎంఇఓ మైసాజి మాట్లాడుతూ యు-డైస్ ప్లస్ యొక్క సరైన నివేదికపై పాఠశాల అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. మధ్యాహ్నం భోజనం, పుస్తకాలు, ఉపాధ్యాయుల నియామకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆన్లైన్తో పాటు సంబంధిత ప్రధానోపాధ్యాయులు వివరాలను సమర్పించాలన్నారు.