byసూర్య | Tue, Dec 05, 2023, 05:48 PM
డి ఏ ఎమ్ యూ కృషి విజ్ఞాన కేంద్రం అదిలాబాద్ శాఖ ఉమ్మడి జిల్లా ప్రజలకు మంగళవారం వాతావరణ హెచ్చరికను జారీ చేసింది. రానున్న 48 గంటల్లో అదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు రైతులు వరి ధాన్యం ఇతరత్రా పంట ఉత్పత్తులను టార్పాలిన్ కప్పుకోవాలని, రసాయన మందుల పిచ్చికారి చేయడం వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు.