byసూర్య | Tue, Dec 05, 2023, 11:18 AM
తన ఎంపీ పదవికి కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఆయన.. మధ్యాహ్నం లోక్ సభ స్పీకర్ కు రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఉత్తమ్.. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన 14 రోజుల్లో రెండింట్లో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉండగా.. ఎంపీ పదవికి రిజైన్ చేసేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఈ విషయంపై ఏఐసీసీ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. 'సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తాం. ఇవాళే సీఎం పేరును ప్రకటిస్తాం' అని వెల్లడించారు. కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్, భట్టి.. మధ్యాహ్నం ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత సీఎం అభ్యర్థిపై క్లారిటీ రానుంది.