ఏం జరగుతుందో చూద్దాం.. ఎన్నికల ఫలితాలపై తొలిసారి కేసీఆర్ స్పందన

byసూర్య | Mon, Dec 04, 2023, 09:07 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి స్పందించారు. సోమవారం రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ భేటీ తర్వాత.. ఎమ్మెల్యేలంతా సాయంత్రం సమయంలో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ముందుగా గెలిచిన ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెల 16వ తేదీ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నసాగేందుకు అవకాశం ఉందని తెలిపారు. అయితే... ప్రజలు ఇచ్చిన తీర్పుతో హుందాగా పక్కకు తప్పుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని.. కాంగ్రెస్ సర్కారులో ఏం జరగుతుందో చూద్దామని ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ సూచించారు. అంతేకాకుండా.. త్వరలోనే తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం నిర్వహించుకుందామని కేసీఆర్ తెలిపినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇక అదే సమావేశంలో.. బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేతను కూడా ఎన్నుకుందామని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్లు కూడా కలిశారు.


Latest News
 

పండగ సాయన్న స్పూర్తి తో ముందుకు వెళ్దాం : నీలం మధు Fri, Sep 20, 2024, 12:27 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. Fri, Sep 20, 2024, 12:25 PM
మెదక్ బిజెపి ఎంపి రఘునందన్‌రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం Fri, Sep 20, 2024, 12:12 PM
మందుల దుకాణాలు పై డీసీఏ అధికారులు దాడులు Fri, Sep 20, 2024, 12:07 PM
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రీల్స్ చేస్తున్న ఆకతాయిలు Fri, Sep 20, 2024, 11:59 AM