కౌంటింగ్ కేంద్రం నుండి మధ్యలోనే బయటకు వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్.

byసూర్య | Sun, Dec 03, 2023, 01:39 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అనేక చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తోంది. ఓట్ల లెక్కింపు కొనసాగే కొద్దీ కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది.  తాజాగా, చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి భారీ ఆధిక్యం పొందడంతో బాల్క సుమన్ ఇక పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు. కౌంటింగ్ ఆరంభం నుంచి వివేక్ దూకుడు ప్రదర్శించారు. ఐదు రౌండ్ల అనంతరం ఆయన ఆధిక్యం 12 వేలకు పైనే ఉంది. వివేక్ కు 26,122 ఓట్లు లభించగా, బాల్క సుమన్ కు 14,083 ఓట్లు మాత్రమే వచ్చాయి. అటు, కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి నిష్క్రమించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆయన మూడో స్థానంలో కొనసాగుతున్నారు. 


Latest News
 

చైర్మన్ సీఈవోల మధ్య విభేదాల పోరు..! Sun, Sep 22, 2024, 11:00 AM
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమం Sun, Sep 22, 2024, 10:56 AM
గుంజపడుగు లో కార్టన్ అండ్ సెర్చ్ చేసిన పోలిసులు Sun, Sep 22, 2024, 10:52 AM
పంచాయతీ కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా Sun, Sep 22, 2024, 10:50 AM
గూడూరులో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు Sun, Sep 22, 2024, 10:48 AM