byసూర్య | Sun, Dec 03, 2023, 10:46 AM
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 65 స్థానాల్లో కాంగ్రెస్, 39 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 5 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ్వేల్ తొలి రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ ముందంజలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) ముందంజలో ఉన్నారు. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య (బీఆర్ఎస్) ముందంజలో ఉన్నారు.
నల్గొండ పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉండగా, పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్, వర్ధన్నపేటలో నాగరాజు, ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటి, మధిరలో భట్టి విక్రమార్క, అశ్వారావుపేటలో ఆదినారాయణ, కొడంగల్లో రేవంత్రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. అధికార బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కడా లీడ్ కనిపించలేదు.