byసూర్య | Sun, Dec 03, 2023, 10:39 AM
రామగుండం నియోజకవర్గంలో ఆదివారం రామగిరి మండలం జేఎన్టీయూ కాలేజీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఆదిక్యత కనబరుస్తుంది. మూడు రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ 12737 ఓట్లతో ఆదిక్యం కనబరిచారు. సమీప టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ 4710 ఓట్లతో పోటీ ఇస్తున్నారు. బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి 2వేల95 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సోమవరపు సత్యనారాయణ 128 ఓట్లు పోలయ్యాయి.