byసూర్య | Sun, Dec 03, 2023, 09:59 AM
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో కౌంటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
దుబ్బాకలో బీఆర్ఎస్ లీడ్ లో ఉంది. బీజేపీ నేత రఘనందన్ వెనుకంజలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లీడింగ్లో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఆయన 5,407 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.