byసూర్య | Sat, Dec 02, 2023, 11:29 AM
తెలంగాణలో ఆదివారం వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో హంగ్ వచ్చే అవకాశం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. హంగ్ రాదని.. కాంగ్రెస్కే పూర్తి మెజార్టీ వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్పోల్స్ ఫలితాలు.. కాంగ్రెస్కు అనుకూలంగా ఉండడాన్ని మంత్రి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. యువకులు, రైతులు, దళితులు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కసితో ఓటేశారని పేర్కొన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు 8. 30 గంటల నుంచి జరుగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే సమాంతరంగా రెండు కౌంటింగ్ ప్రక్రియలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.