సీఐ కొడుకు నిర్లక్ష్యం.. మహిళ మృతి

byసూర్య | Sat, Dec 02, 2023, 11:29 AM

ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం ఒక మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హనుమకొండ జిల్లా ఖాజీపేటలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఫాతిమానగర్‌కు చెందిన మహిళ స్కూటీ ఎక్కుతుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో ఎక్సైజ్ సీఐ శరత్ కుమారుడు వంశీ కారును నడుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల నుంచి తమ ఫిర్యాదును తీసుకోవడం లేదంటూ ఫాతిమానగర్ జంక్షన్‌లో ధర్నా చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జాం కాగా.. పోలీసులు తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వారు తేల్చిచెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 


 


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM