byసూర్య | Sat, Dec 02, 2023, 10:35 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెల్లడైన ఎగ్జిట్పోల్స్ ఫలితాలు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వస్తుందనే ధీమా విజయం తమదేనంటూ నేతల సంబురాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇంటికి నేతలు క్యూ కట్టారు. ఓట్ల లెక్కింపు వరకూ ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ సూచించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసి, ఎగ్జిట్పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక రేపు ఉదయం 08:00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అలాగే పందేల జోరు ఊపందుకుంది. రూ.1000 నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్ వేస్తున్నారు. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే దావత్ చేస్తాం.. టూర్కు తీసుకెళ్తామంటూ పందేలు కాస్తున్నారు.