byసూర్య | Sat, Dec 02, 2023, 10:33 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను ఎంపిక చేశామని సీఈవో వికాస్రాజ్ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను అమలు చేస్తున్నామని తెలిపారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసి, ఎగ్జిట్పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక రేపు ఉదయం 08:00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అలాగే పందేల జోరు ఊపందుకుంది. రూ.1000 నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్ వేస్తున్నారు. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే దావత్ చేస్తాం.. టూర్కు తీసుకెళ్తామంటూ పందేలు కాస్తున్నారు.