byసూర్య | Sat, Dec 02, 2023, 08:57 AM
ఈ నెల 30న శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ఉండడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు తమ స్వగ్రామంలో ఓటు వేయడానికి తరలివచ్చారు. ఓటు వేయడం అయిపోవడంతో తిరిగి ఉద్యోగ ఉపాధి వ్యాపారాల నిమిత్తం వారు ఉండే ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు. దీనితో బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం కోదాడ బస్సు డిపో నుండి అదనపు బస్సులు వేసినట్లు డిపో మేనేజర్ శ్రీహర్ష తెలిపారు.