byసూర్య | Fri, Dec 01, 2023, 04:30 PM
ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఇక ఫలితాలపై అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి ఆంచనాలు వేసుకుంటున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 29 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు తామే గెలుస్తామని ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పాతబస్తీలోని 7నియోజకవర్గాల్లో తమదే విజయం అని. ఎంఐఎం నేతలు అంటుండగా బీజేపీ నేతలు సైతం ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరు గెలుస్తారో డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.