byసూర్య | Fri, Dec 01, 2023, 04:34 PM
సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన పోలింగ్ లో 85. 27 శాతం పోలింగ్ నమోదు అయిందని సంబంధిత అధికారులు తెలిపారు. గురువారం ఏడు గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ రాత్రి పది గంటల వరకు కొనసాగింది.
నియోజకవర్గంలో మొత్తం 2. 43. 118 మంది ఓటర్ల ఉండగా వారిలో 1. 18. 885 పురుషులు, 1. 24. 225 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వారిలో 2. 07. 306 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.