byసూర్య | Fri, Dec 01, 2023, 04:39 PM
అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు చర్ల మండలంలో ఓటర్లను భయపెట్టే చర్యలకు దిగారు. గురువారం చర్ల ఓటర్లు ఏజెన్సీ ప్రాంతంలోని అటవీ గ్రామాల నుంచి తరలివచ్చి ఓట్లు వేస్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతర అమర్చారు.
చినముడిసిలేరు, బి. కొత్తూరు గ్రామాల మధ్యలో ఉన్న కల్వర్ట్ వద్ద ఈ మందు పాతర అమర్చారు. బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ బృందాలు రంగంలోకి దింపి బాంబు నిర్వీర్యం చేసాయి.