byసూర్య | Fri, Dec 01, 2023, 04:29 PM
వైరా నియోజకవర్గ పరిధిలోనే జూలూరుపాడు మండలంలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
మండలంలో గురు వారం ఉదయం 7 గంటల నుండి ప్రజలు ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో బారులు తీరగా సాయంత్రం ఐదు వరకు పోలింగ్ కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. కాగా మండల వ్యాప్తంగా 82% పోలింగ్ నమోదయిందని పేర్కొన్నారు.