byసూర్య | Fri, Dec 01, 2023, 04:25 PM
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బూతుల వద్ద ఎన్నికల అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చినా ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తితే తక్షణమే మందులను అందజేశారు. కారేపల్లి మండల వైద్యులు సురేష్, శ్రేష్ట సౌఫల్య, పలువురు సిబ్బంది ఈ ఉచిత వైద్య శిబిరాలల్లో పాల్గొని వైద్య సేవలు అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.