byసూర్య | Fri, Dec 01, 2023, 04:18 PM
రాష్ట్రంలో మళ్ళీ మనదే అధికారం అని పార్టీ నేతలకు బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇవాళ ప్రగతి భవన్ లో పలువురు బిఆర్ఎస్ అభ్యర్థులు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. పోలింగ్ అనంతరం వచ్చిన ఎగ్జిట్పోల్ ఫలితాలపై సీఎంతో చర్చించారని సమాచారం. ఆగంకావొద్దు, పరేషాన్ అవొద్దు అంటూ కేసీఆర్ వాళ్లకు ధైర్యం నింపారు. ఎల్లుండి అందరం కలిసి సంబరాలు చేసుకుందాం అని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది.