byసూర్య | Fri, Dec 01, 2023, 03:52 PM
నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీలు విడుదల చేశామని, నవంబర్ 30 తర్వాత నీటి విడుదల కోసం ఏపీ నుంచి వినతి అందలేదని కృష్ణా బోర్డు కమిటీ తెలిపింది. సాగర్ కుడి కాలువ నుంచి నీరు కోసం ఏపీ,తెలంగాణ మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.