byసూర్య | Fri, Dec 01, 2023, 03:19 PM
ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్నది. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ప్రకటన జారీ చేసింది. తెలంగాణ మూడో శాసనసభకు నవంబర్ 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తేదీన జరగనుంది.