byసూర్య | Wed, Nov 29, 2023, 08:14 AM
ఎలాగైనా గెలుపొందాలని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పైసల పంపిణీకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయా పార్టీల అభ్యర్థులు తెరలేపారు. కులసంఘాల ద్వారా ఓట్లు కొనేందుకు పైసల పంపిణీ షురూ చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు కుల సంఘాల సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ప్రచార ఘట్టం ముగిసి, మరో 24 గంటలలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గంప గుత్తగా ఓట్లు వేసుకునేందుకు సామర్థ్యం మేరకు థాయిలాలు అందించే పనిలో పడ్డారు.