byసూర్య | Tue, Nov 28, 2023, 03:05 PM
కేసీఆర్ పేదలను కొట్టి పెద్దలకు భూములను ఇస్తున్నారని BJP అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్లో ఎస్సీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల పాల్గొని మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని అన్నారు. భూమి ఇవ్వకపోగా పేదలకు ఉన్న భూములను లాక్కున్నారని ఆరోపించారు. రూ.10 లక్షల పరిహారం ఇచ్చి.. కోట్లకు అమ్ముకున్నారని మండిపడ్డారు. ఆత్మీయ సమ్మేళనంలో MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు.
బీజేపీతోనే బీసీలకు న్యాయం చేకూరుతుందని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని లోయపల్లిలో పార్టీ అభ్యర్థి నోముల దయానంద్ కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పనులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తామే చేసినట్లు చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు.