వారికి కూడా పట్టాలు ఇస్తాం: సీఎం కేసీఆర్

byసూర్య | Tue, Nov 28, 2023, 03:01 PM

ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ వరంగల్ సభలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. రాబోయే కొద్దిరోజుల్లోనే ఇక్కడ లక్ష ఉద్యోగాలు వస్తాయి. విద్య, వైద్యంలో ముందుకెళ్తున్నాం. వరంగల్ మాస్టర్ ప్లాన్ తయారు చేశాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అంటున్నారు. ఆ ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎమర్జెన్సీ రోజులే, చీకటి రోజులే. పార్టీల చరిత్ర ఆధారంగా ఓటు వేయాలి." అని కేసీఆర్ కోరారు.
ద్యమ సమయంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ ప్రజా ఆశిర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 'పార్టీ అభ్యర్థులపై ఆలోచన చేయాలి. అంతకంటే ముఖ్యంగా వారి పార్టీల ఆలోచన విధానం, వారి దృక్పథం గురించి ఆలోచించాలి. కాంగ్రెస్ 50 ఏళ్ళ పరిపాలన చరిత్ర.. బీఆర్ఎస్ 10 ఏళ్ళ పోల్చి చూడాలి. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ అంటుంది.. ఎవనికి కావలి ఇందిరమ్మ రాజ్యం.. ఆ రాజ్యం బాగాలేకుంటేనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు అని వ్యాఖ్యానించారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM