సిద్దిపేటలో తీవ్ర విషాదం.. బావిలో శవమై కనిపించిన యువకుడు

byసూర్య | Tue, Nov 28, 2023, 01:49 PM

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో శ్రీగిరిపల్లిలో విషాద ఘటన చోటుచేసకుంది. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని ఓ బావిలో బలరాం రమేశ్(26) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన రమేశ్.. శవమై కనిపించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. శ్రీగిరిపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని రమేశ్ ప్రేమించినట్లు సమాచారం.
యువతి కుటుంబికులే రమేశ్ ను హత్య చేసి బావిలో పడేశారని ఆరోపిస్తూ మృతదేహంతో రమేశ్ కుటుంబ సభ్యులు, బందువులు ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రికత్త నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి.. నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామినిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలినియాల్సి ఉంది.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM